Indian Railways: నేటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరిగాయా? ఇదీ నిజం
Indian Railways: కొత్త ఏడాదిలో ప్రయాణికులకు భారతీరైల్వే షాకిచ్చిదంటూ ఓ వార్త సోషల్ మీడియాలోవైరల్గా మారింది. కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా రైల్వే టికెట్ల ధరలు పెంచిందని.. జనవరి 6 నుంచే టికెట్ల ధరల పెంపు అమల్లోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్ధలు పేర్కొంటున్నాయి.
Indian Railways: కొత్త ఏడాదిలో ప్రయాణికులకు భారతీరైల్వే షాకిచ్చిదంటూ ఓ వార్త సోషల్ మీడియాలోవైరల్గా మారింది. కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా రైల్వే టికెట్ల ధరలు పెంచిందని.. జనవరి 6 నుంచే టికెట్ల ధరల పెంపు అమల్లోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్ధలు పేర్కొంటున్నాయి.
2/ 6
కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. వాట్సప్లోనూ సందేశాలు పంపిస్తున్నారు. ఈ ప్రచారంపై పీఐబీ (Press Information Bureau) స్పందిచింది.
3/ 6
రైలు టికెట్లను పెంచారని వస్తున్న వార్తలు ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇవి తప్పుడు వార్తలని.. పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.
4/ 6
రైలు టికెట్ల ధరలను పెంచే యోచనలో కేంద్రం లేదని తెలిపింది. టికెట్ల రేట్ల పెంపు దిశగా రైల్వేశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని PIB factcheck స్పష్టం చేసింది.
5/ 6
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించింది. రైళలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రైల్వేశాఖే అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించింది.
6/ 6
కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.