2020లో ఈ ప్రపంచం అంతం అయిపోతుందని చాలా మంది అనుకున్నారు. అలా జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సంవత్సరం విపత్తులు ఏవైనా ఉన్నాయా అని యుగాంత కారులు వెతుకుతున్నారు. వారికి నాసా చెప్పిన ఓ వార్త కలవరం కలిగిస్తోంది. ఏంటంటే... ఓ భారీ గ్రహశకలం భూమివైపు వస్తోంది. దాని సైంటిఫిక్ నేమ్ 2020 XU6. ఇది సరిగ్గా ఫిబ్రవరి 22న భూమికి దగ్గరగా వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇది ఎంత పెద్దదంటే... 698 అడుగులు ఉంది. న్యూయార్క్లోని స్టా్ట్యూ ఆఫ్ లిబర్టీ తెలుసుగా... దాని ఎత్తు... 305 అడుగులు. అంటే... ఈ గ్రహశకలం దానికంటే రెట్టింపు సైజులో ఉన్నట్లు లెక్క. అది గంటకు 30,240 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. అంటే సెకెండ్కి 8.4 కిలోమీటర్ల వేగం. అంటే భూమి చుట్టూ ఇది జస్ట్ గంటలోనే తిరగగలదు. అంత వేగంతో వచ్చే గ్రహశకలం ఢీ కొంటే ఇంకేమైనా ఉందా... ప్రపంచ నాశనమే. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ గ్రహశకలాన్ని నాసా... భూమికి చేరువలో ఉన్న గ్రహశకలాలు (‘Near Earth Object’ - NEO) లిస్టులో చేర్చింది. దీన్ని ప్రమాదకర గ్రహశకలంగా చెప్పింది. ఐతే... ఇది భూమిని ఇప్పుడు ఢీకొట్టే అవకాశాలు మాత్రం లేవని తెలిపింది. ఐతే... యుగాంత కారులు మాత్రం... నాసాకి అన్నీ తెలుసు అనుకోవద్దు అని అంటున్నారు. నాసా ఎన్నోసార్లు గ్రహశకలాల రాకను గుర్తించలేకపోయిందనీ... అవి భూమి వైపు వచ్చి, వెళ్లిపోయాకే నాసా గుర్తించిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. అందువల్ల గ్రహశకలం భూమిని ఢీకొట్టలేదని అనుకోవద్దని అంచనా వేసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ గ్రహశకలాలు మార్స్, జూపిటర్ మధ్య తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఇవి ఇతర గ్రహాల గురుత్వాకర్షణ వల్ల దారి మళ్లుతాయి. వీటిలో భూమిని ఢీకొట్టగలిగేవి దాదాపు 2000 దాకా ఉన్నాయి. లక్కీగా ఏవీ ఢీకొట్టట్లేదు. కాకపోతే... ఇవన్నీ మన భూమి ఏర్పడిన 460 కోట్ల సంవత్సరాల కిందటివే. అందువల్లే వీటిని నాసా సహా ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూ ఉంటారు. (image courtesy - NASA)