HYDERABAD NIGHT CURFEW IN TELANGANA LIST GIVEN FOR EXEMPTION VS
Telangana night curfew ; తెలంగాణలో రాత్రి కర్ష్యూ... ఎవరికి మినహాయింపు ? 30 తర్వాత ఏం జరగనుంది ?
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో. . రాత్రి తొమ్మిది తర్వాత ఎవరు రోడ్ల పై తిరగకూడదంటూ స్పష్టం చేసింది. మొత్తం వ్యాపార సంస్థలన్ని రాత్రి
ఎనిమిది గంటల వరకే మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. నిత్యవసరాల సర్వీసులు మినహా మొత్తం వ్యాపార సంస్థలకు బ్రేక్ వేసింది.
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ష్యూను విధించడంతో పాటు వీకెండ్లలో లాక్డౌన్ విధిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడ
ఆ దిశగా అడుగులు వేసింది. ఈనేపథ్యంలోనే రాత్రి పూట పూర్తి స్థాయి కర్ఫ్యూ విధిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటలవరకు కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. . కాగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.. అయితే దీని నుండి
అత్యవసర సర్వీలను మినహాయించారు.
మినహాయింపులు ఎవరికి ? ఈ కామర్స్..తోపాటు రాత్రి ప్రయాణికులకు మినహాయింపు
తెలంగాణలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో. . రాత్రి తొమ్మిది తర్వాత ఎవరు రోడ్ల పై తిరగకూడదంటూ స్పష్టం చేసింది. మొత్తం వ్యాపార సంస్థలన్ని రాత్రి ఎనిమిది గంటల వరకే మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. నిత్యవసరాల సర్వీసులు మినహా మొత్తం వ్యాపార సంస్థలకు బ్రేక్ వేసింది. ముఖ్యంగా
అత్యవసర సర్వీసుల్లో , ప్రింట్ అండ్ ఎలక్ట్ర్రానిక్ మీడియా, పవర్ సప్లై, ఆసుపత్రులు. మెడికల్ స్టోర్స్ తోపాటు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి మినహాయింపును ఇచ్చారు..,మరోవైపు మున్సిపల్ సిబ్బంది , ఆనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న వారికి కూడ మినహాయింపులు ఇచ్చారు.
ఇక రాత్రి ప్రయాణం చేసే రైల్యే ప్రయాణికులు,విమాన ప్రయాణికులకు కర్ష్యూ నుండి మినాహయింపు ఇచ్చింది. ఈ కామర్స్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ,కోల్డ్ స్టోరేజీ , వేర్ హౌజింగ్ సర్విసెస్, నిత్వవసరాలు తీర్చే కంపనీలలో పనిచేసే వారికి కూడ కర్ఫ్యూ నుండి మినహాయింపు నిచ్చారు. ఇక కామర్స్ సర్వీసులకు మినహాయింపులు ఇచ్చింది.ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు సప్లై చేసేవారికి కూడ మినహాయింపు ఉ:ది.
లాక్డౌన్ విధిస్తారా..30 తర్వాత ఏం జరగనుంది
అయితే రాష్ట్ర్ర ప్రభుత్వ నిర్ణయంతో లాక్డౌన్ కూడ ఉంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. కేసులు పెరిగినట్టయితే..లాక్డౌన్ పెట్టేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలపై ఒక్కసారిగా భారం వేయడం. గతంలో జరిగిన సఘటనలు దృష్టిలో ఉంచుకుని ఎవ్వరికి ఎలాంటీ ఇబ్బంది కల్గకుండా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రాష్ట్ర్ర మంత్రులతో పాటు సీఎం కేసీఆర్ సైతం లాక్డౌన్ ఉండదని స్పష్టం చేశారు..కాని పరిస్థితులు చూస్తుంటే విపరీతంగా కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక అత్యవసరంగా లాక్డౌన్ విధించకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈనెల ముప్పైన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్ 30 వరకే కర్ష్యూ ఉంటుందని ప్రకటించింది. ఇక ఎన్నికల తర్వాత మరోసారి కరోనా రివ్యూ చేసి పూర్తిస్థాయి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
విషయాలపై రాష్ట్ర్ర పోలీసులు పలు గైడ్లైన్స్ తీసుకురానున్నారు. అయితే గతంలో ఇలాంటీ ఉత్తర్వులు ఉన్నా..పోలీసులు తీసుకన్న నిర్ణయాలే కీలకంగా మారాయి. గతంలో తీసుకున్న కర్స్యూ నిర్ణయాల్లో ఉదయం ఆరు గంటల వరకు విధించగా ఈసారి మాత్రం ఉదయం 5 గంటల వరకే విధించారు.