ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్,ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సన్రైజర్స్కు చాలా ఇంపార్ట్టెంట్. ముంబై ఒక మార్పు చేయగా.. సన్రైజర్స్ నాలుగు మార్పులు చేసింది. ఖలీల్ ఆహ్మద్,విరాట్ సింగ్,ముజీబ్ ఉర్ రెహ్మాన్,అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చారు. ముంబై ఆడమ్ మిల్నేను తుది జట్టులో చేర్చింది.
మ్యాచ్ ప్రారంభ సమయం: 7:30 PM IST
గ్రౌండ్: చెన్నై, చిదంబరం స్టేడియం
ప్రసారం: స్టార్ స్పోర్ట్స్
కోల్కతా నైట్రైడర్స్పై అద్భుత విజయాన్ని సాధించిన ముంబయి ఇండియన్స్.. రెండో విజయంపై కన్నేసింది. ఇక తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఎలాగైనా బోణి కొట్టాలని చూస్తోంది.