
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 14:53 IST
తనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఎలాంటీ ఆనారోగ్య సమస్యలులేవని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తాను ప్రస్థుతం బాగానే ఉన్నానంటూ సీఎం కేసిఆర్ చెప్పారు. మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలు ఫోన్లో పరామర్శించడంతో ఈ సందేశాన్ని పంపారు సీఎం కేసిఆర్.
తెలంగాణ సీఎం కేసిఆర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు పార్టీ సీనియర్ నేతలు , ఇతర మంత్రులు సైతం ఆందోళకు గురైయ్యారు. అభిమానులు పార్టీ కార్యకర్తలు సీఎం కేసిర్ త్వరగా కోలుకోవాలంటూ పలువరు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలోనే హోం ఐసోలేషన్లో ఉన్న సీఎంను పలువురు నేతలు ఫోన్లో పరామర్శించారు. దీంతో తాను బాగానే ఉన్నట్టు సీఎం కేసిఆర్ తెలిపారని పార్టీ నేతలు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
కాగా దేశవ్యాప్తంగా ఇప్పటికే అయిదుగురు సీఎంలకు కరోనా పాజిటివ్ సోకింది. తాజగా సీఎం కేసిఆర్ కు కూడ కరోనా పాజీటివ్ రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైన విషయం తెలిసిందే..దీంతో కాసేపటి క్రితమే రాత్రి కర్ష్యూ కూడ విధించారు. ఇక రానున్న రోజుల్లో మొత్తం లాక్డౌన్ కూడ విధిస్తారా అనేది చర్చనీయాంశగా మారింది.అయితే పరిస్థితులను ఆయా రాష్ట్ర్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా ఉదృతి పెరిగితే మాత్రం పూర్తిస్థాయి లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.