
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 16:48 IST
రవీంద్ర జడేజా.. బ్యాట్స్మెన్గా,బౌలర్గా,ఫీల్డర్గా టీమిండియాలో అత్యుత్తమ ఆటగాడు. బాట్స్మెన్స్ కొట్టిన బంతి అతని చేయి దాటి వెళ్ళిదంటే అది పెద్ద సహాసమే అని చెప్పాలి. మైదానంలో స్పింగ్లా కదిలే జడేజా తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్తోజరిగిన మ్యాచ్లో తన ఫీల్డింగ్ పవర్ ఏంటో రుచి చూపించాడు. కళ్లు చెదిరే క్యాచ్..మెరుపు రనౌట్తో జడేజా గ్రెట్ ఫీల్డింగ్తో ఆదరగొట్టాడు. చహర్ వేసిన 3వ ఓవర్లో ఐదో బంతిని క్రిస్ గేల్ షాట్ ఆడాడు. తర్వాత గేల్ రన్ కోసం రాహుల్కు సిగ్నల్ ఇచ్చాడు. అంతలోనే అయోమయం నెలకొంది. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తాడు రాహుల్. దీంతో గేల్ కూడా అవతలివైపుకు వచ్చేశాడు. బంతి అందుకున్న జడేజా హిట్ త్రో విసరడంతో అది వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్ రనౌట్ అయ్యాడు.
రవీంద్ర జడేజా.. బ్యాట్స్మెన్గా,బౌలర్గా,ఫీల్డర్గా టీమిండియాలో అత్యుత్తమ ఆటగాడు. బాట్స్మెన్స్ కొట్టిన బంతి అతని చేయి దాటి వెళ్ళిదంటే అది పెద్ద సహాసమే అని చెప్పాలి. మైదానంలో స్పింగ్లా కదిలే జడేజా తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్తోజరిగిన మ్యాచ్లో తన ఫీల్డింగ్ పవర్ ఏంటో రుచి చూపించాడు. కళ్లు చెదిరే క్యాచ్..మెరుపు రనౌట్తో జడేజా గ్రెట్ ఫీల్డింగ్తో ఆదరగొట్టాడు. చహర్ వేసిన 3వ ఓవర్లో ఐదో బంతిని క్రిస్ గేల్ షాట్ ఆడాడు. తర్వాత గేల్ రన్ కోసం రాహుల్కు సిగ్నల్ ఇచ్చాడు. అంతలోనే అయోమయం నెలకొంది. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తాడు రాహుల్. దీంతో గేల్ కూడా అవతలివైపుకు వచ్చేశాడు. బంతి అందుకున్న జడేజా హిట్ త్రో విసరడంతో అది వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్ రనౌట్ అయ్యాడు.
అంతేనా గెల్ను ఔటచేయకపోతే రాహుల్ ఫీలవుతాడని అనుకున్నాడో ఏమో తర్వాత గేల్ను ఒక స్టన్నింగ్ క్యాచ్తో డకౌట్కు చేర్చాడు. దీపక్ చహర్ వేసిన 5వ ఓవర్ రెండో బంతిని గేల్ బ్యాక్వర్డ్ దిశగా ఆడాడు. అక్కడ ఉన్న జడేజా స్పైడర్ మ్యాన్లా కదిలి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. పంజాబ్కు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు. వీళ్ళ తర్వాత కింగ్స్ ఒకసారిగా కుప్పకూలింది. పంజాబ్ తక్కువ స్కోర్కే పరిమితం చేయడంలో జడ్డూ కీలకపాత్ర పోషించాడు. ఈ వికెట్లకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ముంబై వేదికగా జరుగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించింది. ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. పంజాబ్ నిర్ధేశించిన 107 పరుగుల స్వల్ఫ టార్గెట్ను చెన్నై మరో 26 బంతులు మిగిలుండగానే చేధించింది. డుప్లెసిస్ 33 బంతుల్లో 36 పరుగులు, మొయిన్ అలీ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. అంతకుముందు పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసింది.