
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 21:23 IST
ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగుతుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా డిఫెడింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ముందు టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేసింది. సన్రైజర్స్ ముందు 151 పరుగుల టార్గెట్ను ఉంచింది. ముంబై ఓపెనర్స్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ జట్టుకు మంచి అరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే 6 ఓవర్లకు ముంబయి 53/0 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (31), డికాక్ (16) శుభారంభం ఇచ్చారు. తర్వాత విజయశంకర్ రెండు తీసి ముంబై జోరును అపాడు. విజయ్ శంకర్ వేసిన 7 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ (32) విరాట్సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విజయ్ శంకర్ 9 ఓవర్లో మరో వికెట్ సాధించాడు. రెండో బంతికి సిక్స్ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై కాస్త మందగించింది.
విజయ్ శంకర్ 9 ఓవర్లో మరో వికెట్ సాధించాడు. రెండో బంతికి సిక్స్ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై కాస్త మందగించింది. చివరిలో పోలార్డ్ తన బ్యాట్ను ఝళీపించి ముంబై స్కోర్ను 150 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరగ్రేటం చేసిన ముజీబుర్ రెహ్మాన్కు 2 వికెట్లు దక్కాయి.